బిహార్‌ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖారారు.!

by Dishanational4 |
బిహార్‌ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖారారు.!
X

పాట్నా: బిహార్‌లో నూతన ప్రభుత్వం మంత్రివర్గం మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మహాఘట్ బంధన్ ప్రభుత్వ కేబినెట్ లో 31 మందికి చోటు కల్పించే అవకాశాలున్నట్లు తెలిపాయి. మంగళవారం ఉదయం 11.30 గంటలకు వీరు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వెల్లడించాయి. కాగా, కేబినెట్ కూటమిలోని అన్ని పార్టీల నుంచి నేతలకు ప్రాధాన్యం ఇచ్చే సూచనలు ఉన్నట్లు తెలుస్తొంది. ఒప్పందంలో భాగంగా నితీశ్ కుమార్ ఆర్జేడీ నుంచి మంత్రులుగా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ నెల 9న నితీశ్ కుమార్ బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఆర్జేడీతో పొత్తుకూడి, మరుసటి రోజే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్‌లో స్వాతంత్య్ర దిన వేడుకలు



Next Story